శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-04-11T06:52:41+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదుగురికి కరోనా సోకినట్లు తెలిసింది.
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదుగురికి కరోనా సోకినట్లు తెలిసింది. ఆలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు జ్వరం బారినపడడంతో శ్వాబ్ పరీక్షలు చేయించుకున్నారు. టికెట్ల కౌంటర్లలో పనిచేసే ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆలయంలో పనిచేసే ఇద్దరు అర్చకులు కూడా కరోనా బారినపడినట్లు తెలిసింది. ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని బ్యాంకు కౌంటర్లో పనిచేసే ఉద్యోగి ఇటీవల కొవిడ్ బారినపడ్డారు. ఆయన కుటుంబసభ్యులకూ వైరస్ సోకడంతో, ఉద్యోగి భార్య వారంకిందట మృతిచెందినట్లు సమాచారం.