కరోనాతో మరో ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2021-08-01T06:10:24+05:30 IST

జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో 284 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనాతో మరో ఐదుగురి మృతి

తిరుపతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో 284 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే వ్యవధిలో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా ఐదుగురు మరణించారు. శనివారం  ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 3087 మంది యాక్టివ్‌ పాజిటివ్‌ బాధితులు వున్నట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 230998కు చేరగా కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 1734కు చేరింది. తాజా పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 32, తిరుపతి రూరల్‌లో 26, తవణంపల్లెలో 22, చిత్తూరులో 20, తొట్టంబేడులో 17, పుత్తూరులో 13, రేణిగుంటలో 12, పులిచెర్లలో 11, ఐరాలలో 10, వెదురుకుప్పంలో 9, నగరి, నారాయణవనం మండలాల్లో 8 వంతున, చంద్రగిరి, యాదమరి మండలాల్లో 6 చొప్పున, మదనపల్లె, శ్రీకాళహస్తి, పీలేరు, బంగారుపాళ్యం, సత్యవేడు, నాగలాపురం మండలాల్లో 5 వంతున, పాకాల, కేవీపల్లె, గుర్రంకొండ మండలాల్లో 3 చొప్పున, పెనుమూరు, కుప్పం, కలికిరి మండలాల్లో 3 చొప్పున, పుంగనూరు, సదుం, సోమల, బి.కొత్తకోట, రామసముద్రం, జీడీనెల్లూరు, ములకలచెరువు మండలాల్లో 2 వంతున, పలమనేరు, కురబలకోట, రొంపిచెర్ల, కార్వేటినగరం, కలకడ, రామచంద్రాపురం, పెద్దపంజాణి, వడమాలపేట, పూతలపట్టు, రామకుప్పం, తంబళ్ళపల్లె, బీఎన్‌ కండ్రిగ, వాల్మీకిపురం, విజయపురం, చౌడేపల్లె, కేవీబీపురం, నిండ్ర, పిచ్చాటూరు, గుడుపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-08-01T06:10:24+05:30 IST