వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి
ABN , First Publish Date - 2021-06-23T04:58:39+05:30 IST
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి
దోమ: వేర్వేరు ఘటనల్లో మంగళవారం ఐదుగురు మృతిచెందారు. కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని పాలెపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెక్కలి నర ్సమ్మ (55) గత కొద్ది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. సోమవారం బాధ భరించలేక పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వికారాబాద్ ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి భర్త అంజిలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
ప్రమాదవశాత్తు చెరువులోపడి బాలుడు..
మేడ్చల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మేడ్చల్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బండమాడారం గ్రామానికి చెందిన జక్కుల ప్రవీణ్ కుమారుడు జక్కుల కార్తీక్(8) మంగళవారం పెద్ద చెరువులోకి దిగిన గేదెలను బయటకు కొట్టేందుకువెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కరోనాతో ఒకరు..
ధారూరు: లక్ష్మినగర్ తండాకు చెందిన ఓ వ్యక్తి(33) మంగళవారం కరోనాతో మృతిచెందినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. హైదరాబాద్లో టైల్స్ పనిచేసుకుంటూ జీవనం సాగించే అతడికి మే 17వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. 18న హైదరాబాద్లోని టిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు వివరించారు.
అనారోగ్యంతో మాజీ సర్పంచ్..
కొడంగల్: అనారోగ్యంతో మాజీ సర్పంచ్ బింధు మాధవరావు(92) మంగళవారం ఉదయం మృతి చెందారు. అంగడిరైచూర్కు చెందిన ఆయన మాజీ సర్పంచ్గా, పీఏసీఎస్ అధ్యక్షుడిగా తదితర పదవులతో ప్రజాసేవ చేశారు. ఆయన మృతిరాజకీయంగా తీరని లోటని మాజీ జడ్పీటీసీ భాస్కర్, సర్పంచ్ గోవిందు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీ.రాంరెడ్డి అన్నారు. స్వగ్రామం అంగడిరైచూర్లో నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఘట్కేసర్ రూరల్: గుర్తుతెలియని ఓవ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఘట్కేసర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అవుషాపూర్ సమీపంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లేదారిలో 45 నుంచి 50 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని ఓవ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.