రెండు లారీలు ఢీ: ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2021-06-19T04:47:58+05:30 IST
చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై కల్లూరు సమీపంలోని కొమ్మిరెడ్డిగారిపల్లె క్రాస్ వద్ద రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కల్లూరు, జూన్ 18: చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై కల్లూరు సమీపంలోని కొమ్మిరెడ్డిగారిపల్లె క్రాస్ వద్ద రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు ఎస్ఐ శ్రీనివాస్ కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం నుంచి కడప జిల్లా ఎర్రగుంట్లకు వెళుతున్న లారీని, పీలేరు నుంచి చిత్తూరుకు వెళుతున్న పాల ట్యాంకర్ శుక్రవారం సాయంత్రం ఢీకొంది. తమిళనాడు లారీ డ్రైవర్ అంజి (35), క్లీనర్ వల్లి (32), లారీలోని కూలీలు రమేష్ (30), మహమ్మద్ రఫీ (36) తీవ్రంగా గాయపడ్డారు. బంగారుపాళెంకు చెందిన పాల ట్యాంకర్ డ్రైవర్ జిలానీబాషా (39) గాయాలపాలయ్యాడు. గాయపడ్డ వారిని ఎస్ఐ శ్రీనివాస్ పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కల్లూరు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.