ప్రయాణికురాలికి అస్వస్థత.. గన్నవరంలో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

ABN , First Publish Date - 2021-05-08T15:45:05+05:30 IST

విజయవాడ: ఇండిగో విమానంలో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

ప్రయాణికురాలికి అస్వస్థత.. గన్నవరంలో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

విజయవాడ: ఇండిగో విమానంలో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి పశ్చిమబంగాలోని శిలుగురి ఇండిగో విమానం వెళుతోంది. అయితే బెంగుళూరు నుంచి బాగ్ డోగ్రకు వెళ్లాల్సిన ప్రయాణికురాలికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. గమనించిన ఇండిగో సిబ్బంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాశ్రయ అంబులెన్స్ సాయంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-05-08T15:45:05+05:30 IST