విమానంలో గుండెపోటుతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-10-23T16:39:16+05:30 IST
బెంగళూరు నుంచి ఢిల్లీ నగరానికి విస్తార యూకే 818 విమానంలో వెళుతున్న ప్రయాణీకుడికి గుండెపోటు రాగా మృతి చెందారు. ఈమేరకు విమానయాన సిబ్బంది ద్వారా తెలిసింది. ఢిల్లీ నగరానికి చెందిన మనోజ్కుమార్
బెంగళూరు(Karnataka): బెంగళూరు నుంచి ఢిల్లీ నగరానికి విస్తార యూకే 818 విమానంలో వెళుతున్న ప్రయాణీకుడికి గుండెపోటు రాగా మృతిచెందారు. ఈమేరకు విమానయాన సిబ్బంది ద్వారా తెలిసింది. ఢిల్లీ నగరానికి చెందిన మనోజ్కుమార్ అగర్వాల్ బెంగళూరు నుంచి ఢిల్లీకు విస్తారాలో గురువారం రాత్రి బయలుదేరారు. రాత్రి 9.30గంటల వేళ మనోజ్కుమార్కు తీవ్రమైన శ్వాసకోశ సమస్య తలెత్తింది. వెంటనే వి మానాన్ని ఇండోర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా కాసేపటికే మృతి చెందారు. తీవ్రమైన గుండెపోటు రావడంతోనే మనోజ్ కుమార్ మృతి చెందినట్లు ఇండోర్ వైద్యులు ప్రకటించినట్లు విమాన సిబ్బంది తెలిపారు. ప్రాణాలు కాపాడేందుకు అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసినా సాధ్యం కాలేదని ప్రకటించారు.