జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో భేటీ

ABN , First Publish Date - 2021-12-16T23:14:00+05:30 IST

సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని

జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో భేటీ

అమరావతి: సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని జగన్‌ కోరారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జగన్‌ ప్రతిపాదనలపై సానుకూలంగా ఫ్లిప్‌కార్ట్‌ స్పందించింది. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు సుముఖత వ్యక్తం చేసింది. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

Updated Date - 2021-12-16T23:14:00+05:30 IST