స్మార్ట్ఫోన్లపై Flipkart ఆఫర్
ABN , First Publish Date - 2021-08-19T23:23:22+05:30 IST
స్మార్ట్ఫోన్లపై Flipkart ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఫ్లిప్కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ పేరుతో స్మార్ట్ఫోన్లతోపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ తన ఐదు రోజుల మొబైల్స్ బొనాంజా విక్రయాన్ని ప్రారంభించింది. ఫ్లిప్కార్ట్ సేల్ కొన్ని ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ కస్టమర్లు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రీపెయిడ్ ఆఫర్లను కూడా పొందవచ్చని సంస్థ తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు తక్షణ డిస్కౌంట్ లభించనుందని సంస్థ తెలిపింది. ఐఫోన్ 12 మిని ఫోన్ ప్రారంభ ధర రూ. 59,999 నుంచి రూ. 67,900 వరకు ఉంటుంది. ఫోన్ అసలు ధర రూ. 69,900 ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ ఫోన్ తగ్గింపు ధరతో రూ. 34,999కే లభించనుంది.