పంటపొలాలకు ముప్పుగా మారిన వరదకాలువ నీరు
ABN , First Publish Date - 2021-10-18T05:21:03+05:30 IST
కుందూ-పెన్నా అను సంధాన వరద కాలువ నీటితో పంట పొలాలకు ముప్పు ఏర్పడింది.
ప్రొద్దుటూరు అర్బన్, అక్టోబరు 17: కుందూ-పెన్నా అను సంధాన వరద కాలువ నీటితో పంట పొలాలకు ముప్పు ఏర్పడింది. కాలువ కట్టకు వేసిన మట్టికట్టలను అక్రమా ర్కులు ట్రాక్టర్లతో తరలించటం వల్ల కాలువకు గండి పడి నీరంతా పంటపొలాల్లోకి చేరి నష్టంవాటిల్లుతోందని పలు వురు రైతులు వాపోతున్నారు. ఆదివారం రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామ పొలంలో దళిత రైతు సుబ్బమ్మ పొలంలో వరదకాలువ నీటివల్ల మినుముపంట దెబ్బతిన్న విషయాన్ని దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాదిగ పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ వరదకాలువ పూర్తి కాకపోవడం వల్ల కాలు వలోకి ఎగువ నుంచి వచ్చే వర్షం నీరు కిందికి వెళ్ళె మా ర్గంలేక నీరంతా పొలాల్లోకి వెళ్లి పంటలను ముంచు తోందని వాపోయారు. ఇరిగేషన్ అధికారులు ఆప్రాంతం లో పర్యటించి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.