శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
ABN , First Publish Date - 2020-08-16T00:41:55+05:30 IST
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 868.80 అడుగులు ఉంది.
కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 868.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు, ప్రస్తుతం 136.6026 టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,25,969 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.