గోదావరి నదికి కొనసాగుతున్న వరద ఉథృతి
ABN , First Publish Date - 2021-09-13T01:00:02+05:30 IST
గోదావరి నదికి వరద ఉథృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ
రాజమండ్రి: గోదావరి నదికి వరద ఉథృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేసి.. 7లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రా చలం దగ్గర వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కోనసీమలోని ప్రధానమైన గౌతమి, వశిష్ఠ వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహిస్తూ పల్లపు లంక గ్రామాలను ముంచె త్తుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది.