వరద తెచ్చిన తంటా..
ABN , First Publish Date - 2020-12-03T04:44:37+05:30 IST
వరద వలన పంటలు పోయిన రైతులు నష్టాల బారిన పడటమేకాదు, తరువాత కూడా కష్టాలు తప్పడం లేదు.
సిద్ధాపురం (ఆకివీడు రూరల్) డిసెంబరు 2 : వరద వలన పంటలు పోయిన రైతులు నష్టాల బారిన పడటమేకాదు, తరువాత కూడా కష్టాలు తప్పడం లేదు. వరదతో చేలు చెత్త, తూడు, తామర పువ్వులతో నిండిపో యాయి. వాటిని తొలగించేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
వీరవాసరం: మండల పరిధిలోని మురుగు డ్రెయిన్లలో తూడు పేరుకుపోయింది. రాణీకోడు, అడ్డకోడు తల్లిపరకోడుల్లో తూడు కారణంగా చేలల్లో ముంపు నీరు ఇప్పటికీ అలాగే నిలిచిఉంది.