వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-22T05:46:18+05:30 IST

గోదావరి వరదల సమయంలో ములకల్లంక గ్రామ సంరక్షణలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ ఎన్‌.సీతాపవన్‌కుమార్‌ సూచించారు.

వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలి

సీతానగరం, జూన్‌ 21: గోదావరి వరదల సమయంలో ములకల్లంక గ్రామ సంరక్షణలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ ఎన్‌.సీతాపవన్‌కుమార్‌ సూచించారు. సోమవారం ఆయన పలు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రానున్న గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదల సమయంలో ములకల్లంకకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని, అక్కడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో సూర్యరమేష్‌, సీహెచ్‌వో రాధాకృష్ణ, విద్యుత్‌ శాఖ ఏఈ త్రిమూర్తులు, డిప్యూటీ తహశీల్దారు సునీత పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:46:18+05:30 IST