వరదల సమయంలో అందరిని అప్రమత్తం చేశాం: అనిల్‌

ABN , First Publish Date - 2021-12-04T21:07:52+05:30 IST

వరదల సమయంలో అందరిని అప్రమత్తం చేశామని మంత్రి అనిల్‌ తెలిపారు. అన్నమయ్య డ్యామ్‌ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుదోవ

వరదల సమయంలో అందరిని అప్రమత్తం చేశాం: అనిల్‌

అమరావతి: వరదల సమయంలో అందరిని అప్రమత్తం చేశామని మంత్రి అనిల్‌ తెలిపారు. అన్నమయ్య డ్యామ్‌ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కనీస అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ప్రాజెక్ట్‌ ఘటన మానవ తప్పిందమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, విపత్తులను కూడా ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌ కెపాసిటీ 2.13 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, గంటల వ్యవధిలోనే 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని అనిల్‌ తెలిపారు.

Updated Date - 2021-12-04T21:07:52+05:30 IST