గండిపోచమ్మను తాకిన గోదావరి

ABN , First Publish Date - 2022-07-08T08:40:18+05:30 IST

గండిపోచమ్మను తాకిన గోదావరి

గండిపోచమ్మను తాకిన గోదావరి

దేవీపట్నం/ధవళేశ్వరం, జూలై 7: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని కొండమొదలు నుంచి పోచమ్మగండి వరకు గోదావరి వరద నెమ్మదినెమ్మదిగా పెరుగుతోంది. గురువారం ఉదయం గండి పోచమ్మ విగ్రహం వరకు నీరు వచ్చి చేరింది. 


కాగా, కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో కాటన్‌ బ్యారేజ్‌ ధవళేశ్వరం ఆర్మ్‌లో గేట్లు ఎత్తి 41,044 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.09 అడుగులుగా నమోదైంది.

Updated Date - 2022-07-08T08:40:18+05:30 IST