అంతరిక్ష యాత్ర చేసేందుకు రండి...

ABN , First Publish Date - 2021-03-03T16:11:13+05:30 IST

మీరు నాతోపాటు అంతరిక్ష యాత్ర చేయాలనుకుంటున్నారా? అయితే రండి అంటూ జపాన్ బిలియనీర్...

అంతరిక్ష యాత్ర చేసేందుకు రండి...

కళాకారులకు జపాన్ బిలియనీర్ ఆహ్వానం

టోక్యో (జపాన్): మీరు నాతోపాటు అంతరిక్ష యాత్ర చేయాలనుకుంటున్నారా? అయితే రండి అంటూ జపాన్ బిలియనీర్ యుసాకు మేజావా కళాకారులకు పిలుపునిచ్చారు. చంద్రుడిని దగ్గరగా చూసేందుకు వీలుగా ప్రైవేటు యాత్ర కోసం అంతరిక్ష నౌకను బుక్ చేసిన జపాన్ బిలియనీర్ తనతోపాటు ప్రయాణించేందుకు ప్రపంచవ్యాప్తంగా 8 మంది కళాకారులను ఆహ్వానించారు. ఆన్‌లైన్ ఫ్యాషన్ వ్యాపారవేత్త అయిన యుసాకు మేజావా ప్రైవేటు అంతరిక్ష నౌకయాత్ర కోసం డబ్బు చెల్లించి సంచలనం సృష్టించారు.2023వ సంవత్సరంలో ప్రారంభం కానున్న అంతరిక్ష యాత్ర కోసం స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేస్తోంది.తనతో కలిసి అంతరిక్ష యాత్ర చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 8 మంది కళాకారులను ఎంపిక చేస్తానని, దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని మేజావా బుధవారం ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్టు చేశారు.


‘‘ఈ మిషన్‌లో నాతో చేరేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రపంచం నలుమూలల నుంచి మీలో 8మందిని ఎంపిక చేస్తాను, అంతరిక్ష నౌకలో అన్నీ సీట్లు నేను కొన్నాను’’ అని మేజావా చెప్పారు. అంతరిక్ష యాత్రో 10 నుంచి 12 మంది ఉంటారని, ఇది భూమికి తిరిగి వచ్చే ముందు చంద్రుని చుట్టూ తిరగనుంది. మార్చి 14వతేదీ లోగా అంతరిక్ష యాత్రలో పాల్గొనే వారు నమోదు చేసుకోవాలని మార్చి 21 వతేదీ నుంచి స్క్రీనింగ్ చేస్తామని మేజావా చెప్పారు. ఆన్ లైన్ ఇంటర్వ్యూ, వైద్యపరీక్షలతో 2021లో తుది ఎంపిక చేస్తామని మేజావా వెబ్ సైట్ తెలిపింది. 


Updated Date - 2021-03-03T16:11:13+05:30 IST