పారిశుధ్యంపై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2021-05-09T06:29:18+05:30 IST
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నగరం లో పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అధికారులను ఆదేశించారు.
- అధికారులకు మేయర్ ఆదేశం
అనంతపురం కార్పొరేషన, మే8 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నగరం లో పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం తన చాంబర్లో డిప్యూటీ క మిషనర్ రమణారెడ్డితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎప్పటి కప్పుడు డంపర్బిన్స శుభ్రం చేయాలన్నారు. డివిజన్లలో కార్పొరేటర్లను సమన్వ యం చేసుకుంటూ కాలువలు శుభ్రం, బ్లీచింగ్, స్ర్పేయింగ్ వంటి వాటిని మరింత అధికంగా చేపట్టాలని ఆదేశించారు. పారిశుఽధ్యం మెరుగుకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. కాగా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొందరు కార్పొరేటర్లు కనిపించడం గమనార్హం. కార్యక్ర మంలో డీఈ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.