సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి
ABN , First Publish Date - 2021-05-18T05:27:40+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మునిసిపల్ చైర్మన్ సావు వెంకటమురళీ కృష్ణారావు సూచించారు. ఈ మేరకు సోమవారం బొబ్బిలి పట్టణంలో గల 5, 6, 8 వార్డుల సచివాలయాన్ని ఆయన సందర్శించారు.
సీతానగరం (బొబ్బిలి) : ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మునిసిపల్ చైర్మన్ సావు వెంకటమురళీ కృష్ణారావు సూచించారు. ఈ మేరకు సోమవారం బొబ్బిలి పట్టణంలో గల 5, 6, 8 వార్డుల సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. కరోనా నేపథ్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. గొల్లపల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ను పరిశీలించారు. యాదవవీధిలోని కాలువలో పేరుకుపోయిన మురుగు తొలగించాలని పారిశధ్య సిబ్బందిని ఆదేశించారు.