రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-02-25T05:12:03+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణపై మరింత దృష్టి సారించాలని ఎస్పీ సింధుశర్మ అన్నా రు.

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలి
మాట్లాడుతున్న ఎస్పీ సింధుశర్మ

- జగిత్యాల ఎస్పీ సింధుశర్మ

జగిత్యాల టౌన్‌, ఫిబ్రవరి 24: రోడ్డు ప్రమాదాల నివారణపై మరింత దృష్టి సారించాలని ఎస్పీ సింధుశర్మ అన్నా రు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నెల వారీ నేర స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధుశర్మ మా ట్లాడుతూ జిల్లాలో నమోదైన కేసులు, పోలీస్‌ స్టేషన్‌ల వారీగా పెండింగ్‌ కేసుల దర్యాప్తులు, పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎ క్కువగా జరిగే చోట సూచిక బోర్డులను ఏర్పాటు చేయా ల ని సూచించారు. అదనపు ఎస్పీ కె.సురేష్‌కుమార్‌, డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌బాబా, ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:12:03+05:30 IST