పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై దృష్టి: సబితారెడ్డి
ABN , First Publish Date - 2020-08-15T09:23:51+05:30 IST
బడంగ్పేట్ కార్పొరేషన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతామని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు.
సరూర్నగర్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బడంగ్పేట్ కార్పొరేషన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతామని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రపరచడం, ఇతర పారిశుధ్య పనుల నిమిత్తం ప్రతి గ్రామానికీ ప్రత్యేకంగా ఒకరిని కేటాయిస్తామన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై గురువారం రాత్రి ఆమె తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. బాలాపూర్లోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరి ఇటీవలి వానలకు కూలిపోయిందని, పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మేయర్ పారిజాతారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్ మంత్రి సబితారెడ్డిని కోరారు.