పారిశుధ్య పనులపై దృష్టిసారించండి
ABN , First Publish Date - 2020-07-10T10:47:00+05:30 IST
ప్రస్తుత వర్షాకాల తరుణంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నివారణకు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా
డీపీవో శ్రీనివాసరెడ్డి
తిరుమలాయపాలెం, జూలై9: ప్రస్తుత వర్షాకాల తరుణంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నివారణకు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాల సీజన్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాలను కూడా పచ్చదనం, పరిశుభ్రతతో ఉంచాలన్నారు. ముఖ్యంగా దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మంచినీటి ట్యాంకులు, హ్యాండ్ బోర్ల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, మంచినీటి ట్యాంకులను కూడా క్లోరినేషన్తో శుభ్రపరచాలన్నారు. పల్లె ప్రగతిలో పెండింగ్ల పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బి. జయరాం, ఈవోఆర్డీ రాజేశ్వరి, ఎపీవో నర్సింహారావు, కార్యదర్శులు బాలాజీ, రేఖ, సాయి, సునీత, సుష్మిత, తులసీరాం, రాంలాల్, వసంత పాల్గొన్నారు.