15 పంచాయతీలకు ఫాగింగ్యంత్రాలు
ABN , First Publish Date - 2022-01-20T06:15:39+05:30 IST
దోమల బెడదను నివారించడానికి మండలంలో 15 పంచాయతీలకు ఫాగింగ్ యంత్రాలు మంజూరయ్యాయి. ఎంపీపీ శెట్టి నీలవేణి బుధవారం ఆయా పంచాయతీల (కొత్తూరు, కోనాపురం, చిలకలగెడ్డ, లుంగపర్తి, జీనబాడు, పెదబిడ్డ, అనంతగిరి, భీంపోలు, కాశీపట్నం, కొండిభ, కివర్ల, టోకూరు, రొంపల్లి, ఎన్ఆర్పురం, గుమ్మకోట) సర్పంచ్లు, కార్యదర్శులకు ఇక్కడ అందజేశారు. అంతకు ముందు ఆమె పెదబిడ్డ పంచాయతీ కేంద్రంలో పర్యటించారు.
సర్పంచ్లు, కార్యదర్శులకు పంపిణీ చేసిన ఎంపీపీ
అనంతగిరి, జనవరి 19: దోమల బెడదను నివారించడానికి మండలంలో 15 పంచాయతీలకు ఫాగింగ్ యంత్రాలు మంజూరయ్యాయి. ఎంపీపీ శెట్టి నీలవేణి బుధవారం ఆయా పంచాయతీల (కొత్తూరు, కోనాపురం, చిలకలగెడ్డ, లుంగపర్తి, జీనబాడు, పెదబిడ్డ, అనంతగిరి, భీంపోలు, కాశీపట్నం, కొండిభ, కివర్ల, టోకూరు, రొంపల్లి, ఎన్ఆర్పురం, గుమ్మకోట) సర్పంచ్లు, కార్యదర్శులకు ఇక్కడ అందజేశారు. అంతకు ముందు ఆమె పెదబిడ్డ పంచాయతీ కేంద్రంలో పర్యటించారు. సచివాలయం, గిరిజన సంక్షేమ పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ మల్లేశ్వరరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.