నిబంధనలు పాటించాలి: ఎస్ఐ
ABN , First Publish Date - 2021-05-17T05:10:19+05:30 IST
కర్ఫ్యూ నిబంధలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఆలూరు ఎస్ఐ రామనుజులు హెచ్చరిం చారు.
ఆలూరు, మే 16: కర్ఫ్యూ నిబంధలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఆలూరు ఎస్ఐ రామనుజులు హెచ్చరిం చారు. మధ్యాహ్నం 12 తరువాత బయట తిరిగే వారికి ఆయన ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
వాహనదారులపై ఆగ్రహం
ఆదోని రూరల్: కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న వాహనదారులపై తాలుకా సీఐ పార్థసారథి, ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిబ్బనకల్లు క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నందవరం: కరోనా నిబంధనలు పాటించపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నాగరాజు తెలిపారు. అదివారం ఆయన మాట్లాడుతూ వివాహాలు చేసేవారు తప్పక తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్డు మీదికి రాకూడదని అన్నారు.