ఆహార భద్రత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-07-30T04:56:32+05:30 IST

ఆహార భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేసినపుడే పేదరికాన్ని రూపుమాపవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి అన్నారు.

ఆహార భద్రత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
మాట్లాడుతున్న జేసీ గౌతమి

జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి


కడప(కలెక్టరేట్‌), జూలై 29 : ఆహార భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేసినపుడే పేదరికాన్ని రూపుమాపవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి అన్నారు. శుక్రవారం జేసీ చాంబరులో ఆహార భద్రతా చట్టం-2013 అమలు నిర్వహణపై పర్యవేక్షణ, నిరంతర మూల్యాంకనానికి కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన సెంట్రల్‌ ఫర్‌ డెవెల్‌పమెంట్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ స్టడీస్‌ రాజస్థాన్‌ బృంద అధిపతి డాక్టర్‌  ఉపేంద్ర, కె.సింగ్‌లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆహార భద్రతా చట్టం అమలు తీరుతెన్నుల గురించి కేంద్ర బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు సలహాలు, సూచనలు చేశారు. రేషన్‌ దుకాణాల ద్వారా కార్డుదారులకు బియ్యం సరుకులు అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు నేరుగా జమ్మలమడుగు చౌకదుకాణాల వద్దకు వెళ్లి పరిశీలించినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో జేసీ ధర్మచంద్రారెడ్డి, పౌర సరఫరాల శాఖాధికారులు, తూనికలు, కొలతల శాఖ, ఫుడ్‌ సేప్టీ అధికారులతో పాటు డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:56:32+05:30 IST