గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు రూ. 5 వేలు

ABN , First Publish Date - 2022-01-28T05:27:00+05:30 IST

మండలంలోని మొగ్దుంపూర్‌ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు 5 వేల రూపాయలు అందించేందుకు సర్పంచ్‌ జక్కం నర్సయ్య ఆధ్వర్యంలో రూపొందించిన ‘సర్పంచ్‌ కానుక’ కార్యక్రమాన్ని గురువారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ప్రారంభించారు.

గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు రూ. 5 వేలు
సర్పంచ్‌ కానుక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ


- మొగ్దుంపూర్‌లో ‘సర్పంచ్‌ కానుక’


కరీంనగర్‌ రూరల్‌, జనవరి 27: మండలంలోని మొగ్దుంపూర్‌ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు 5 వేల రూపాయలు అందించేందుకు సర్పంచ్‌ జక్కం నర్సయ్య ఆధ్వర్యంలో రూపొందించిన ‘సర్పంచ్‌ కానుక’ కార్యక్రమాన్ని గురువారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ జక్కం నర్సయ్యను ఎంపీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరికి సర్పంచ్‌ కానుక అందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కూకట్ల తిరుపతి, డైరెక్టర్‌ కందుల రమేశ్‌, దాడి లచ్చయ్య, దావనపల్లి అంజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు నాగయ్య, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:27:00+05:30 IST