పార్లమెంట్‌ కమిటీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానిస్తాం : బీకే

ABN , First Publish Date - 2021-06-24T05:59:18+05:30 IST

హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో ఇటీవల ఎంపిక చేసి న కమిటీ కార్యవర్గ ప్రమాణస్వీకారానికి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తామని పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పేర్కొన్నారు.

పార్లమెంట్‌ కమిటీ ప్రమాణ స్వీకారానికి   చంద్రబాబును ఆహ్వానిస్తాం : బీకే
బీకేను అభినందిస్తున్న సాయి ప్రసాద్‌

రొద్దం, జూన 23: హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో ఇటీవల ఎంపిక చేసి న కమిటీ కార్యవర్గ ప్రమాణస్వీకారానికి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తామని పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం రొద్దం మండల పరిధిలోని ఆర్‌.మరువపల్లి గ్రామంలో తనను కలిసేందుకు వచ్చిన పార్లమెంట్‌ కమిటీ సభ్యులతో మాట్లాడారు. కరోనా ఉదృతి తగ్గిన అనంతరం భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి ప్రమాణస్వీకారాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాచంద్రబాబునాయుడుని ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు. రెండ్రోజులుగా, గ్రామ, మండల నియోజకవర్గ కమిటీ ఎంపికలో బీకే బిజీ బిజీగా ఉన్నారు. హిందూపురం పార్లమెంట్‌ మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ కమిటీలపై బీకేతో చర్చించారు. పార్లమెంట్‌ కమిటీ కార్యాలయ కార్యదర్శి సాయిప్రసాద్‌, బీకేను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎం.కొత్తపల్లి, గౌరాజుపల్లి, దొడగట్ట, గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీకేను కలిసి కమిటీలపై చర్చించారు. 


Updated Date - 2021-06-24T05:59:18+05:30 IST