అటవీ ప్రాంతంలో పులి సంచారం

ABN , First Publish Date - 2021-03-06T06:22:51+05:30 IST

బుట్టాయగూడెం మం డలం కొవ్వాడ అటవీ ప్రాంతంలో పులి సంచారంతో గిరిజనులు వణికిపోతున్నారు.

అటవీ ప్రాంతంలో పులి సంచారం

బుట్టాయగూడెం, మార్చి 5: బుట్టాయగూడెం మం డలం కొవ్వాడ అటవీ ప్రాంతంలో పులి సంచారంతో గిరిజనులు వణికిపోతున్నారు. శుక్రవారం కొవ్వాడకు చెందిన వ్యక్తి ఒకరు మేకలను మేపేందుకు అడవికి వెళ్లగా చీకటి వాగు సమీపంలో పులి మేకలపై దాడి చేసి రెండు మేకలను చంపడంతో అతను భయంతో గ్రామానికి పరుగెత్తుకుని వచ్చినట్లు సమాచారం. జరి గిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Updated Date - 2021-03-06T06:22:51+05:30 IST