నష్టపరిహారానికి రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2020-12-01T06:33:00+05:30 IST

తుఫాన్‌ వల్ల వరి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మునగపాక మెయిన్‌ రోడ్డుపై రైతు సంఘం, టీడీపీ, సీపీఎం నాయకులతో పాటు పలువురు రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.

నష్టపరిహారానికి రోడ్డెక్కిన రైతులు
మునగపాక మెయిన్‌ రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న రైతులు

 మునగపాక :  తుఫాన్‌ వల్ల వరి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మునగపాక మెయిన్‌ రోడ్డుపై రైతు సంఘం, టీడీపీ, సీపీఎం నాయకులతో పాటు పలువురు రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.  అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, రైతు భరోసా కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు.  మునగపాక రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి మహేశ్‌, దాడి శివ, టీడీపీ నాయకులు దాడి ముసిలినాయుడు, వెలగా మురళీలతో పాటు  బ్రహ్మాజీ,  అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T06:33:00+05:30 IST