పంజాబ్ కాంగ్రెస్లో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-11-11T01:40:47+05:30 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రూబీ గతంలో బటిండా రూరల్ 'ఆప్' ఎమ్మెల్యేగా ఉన్నారు. మంగళవారంనాడే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా పార్టీకి తెలియజేశారు. పార్టీప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెంటనే ఆ ఆమోదించాల్సిందిగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆ ట్వీట్లో రూబీ కోరారు.
కాగా, రూబీ రాజీనామాపై ఆప్ ఎమ్మెల్యే, పంజాబ్ అసెంబ్లీలో పార్టీ విపక్ష నేత హర్పాల్ సింగ్ చీమా సూటిగా స్పందించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ వచ్చే అవకాశం లేదని గ్రహిచినందునే ఆమె పార్టీ ఫిరాయించిందని అన్నారు.