నేటి నుంచి రాష్ట్రంలో రాహుల్‌ ప్రచారం

ABN , First Publish Date - 2021-02-27T12:05:05+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం నుంచి మూడు రోజులు రాష్ట్రంలో మూడో విడత ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ...

నేటి నుంచి రాష్ట్రంలో రాహుల్‌ ప్రచారం

చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం నుంచి మూడు రోజులు రాష్ట్రంలో మూడో విడత ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) విడు దల చేసిన ప్రకటనలో, రాహుల్‌గాంధీ శనివారం తూత్తుకుడి, శ్రీవైకుంఠం, సాత్తాన్‌కుళం, నాంగునేరి నియోజకవర్గాల్లోను, 28న పాళయంకోట, తిరున ల్వేలి, ఆలంకుళం, పావూర్‌సత్రం, సురండై కడలనల్లూర్‌, పులియాంగుడి, తెన్‌కాశి, కడయం, అంబై, సేరన్‌మహాదేవి, వల్లియూర్‌, నాగర్‌కోయిల్‌ ప్రాం తాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు. మార్చి 1న  కన్నియకుమారి జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ పాల్గొంటారని టీఎన్‌సీసీ తెలియజేసింది.

Updated Date - 2021-02-27T12:05:05+05:30 IST