మాజీ భార్యను మళ్లీ పెళ్లాడేందుకు ఎంఐంఎం నేత ‘హలాలా’ ఎత్తు.. కేసు నమోదు
ABN , First Publish Date - 2021-09-14T21:55:56+05:30 IST
మాజీ భార్యను మళ్లీ పెళ్లాడేందుకు స్నేహితుడితో కలిసి ‘హలాలా’ నిర్వహించేందుకు ప్రయత్నించిన ఉత్తరప్రదేశ్కు
న్యూఢిల్లీ: మాజీ భార్యను మళ్లీ పెళ్లాడేందుకు స్నేహితుడితో కలిసి ‘హలాలా’ నిర్వహించేందుకు ప్రయత్నించిన ఉత్తరప్రదేశ్కు చెందిన ఎంఐఎం నేత రియాజుద్దీన్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై అత్యాచారం, దాడి వంటి అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వేధింపులు, నేరపూరిత కుట్ర వంటి కేసులు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. జామియా నగర్ ప్రాంతంలో బిడ్డతో కలిసి నివసిస్తున్న బాధిత మహిళ 2012లో నిందితుడు, తన మాజీ భర్త రియాజుద్దీన్ స్నేహితుడైన ఫరియద్ను 2012లో వివాహం చేసుకుంది. అయితే, వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం నిలవలేదు. ఫరియద్ ఒకరోజు ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయాడు.
9 ఏళ్లు గడిచిన తర్వాత తాజాగా తన స్నేహితుడైన ఫరియద్తో కలిసి బాధితురాలి ఇంటికి చేరుకున్న రియాజుద్దీన్ అతడితో నిఖా హలాలా నిర్వహించాలని నిర్ణయించాడు. (నిఖా హలాలా.. దీనినే తహలీల్ మ్యారేజ్ అని కూడా అంటారు. ఇస్లాంలో ఇదొక సంప్రదాయం. దీని ప్రకారం.. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న మహిళ.. తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకునేందుకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని మళ్లీ విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది.) తద్వారా ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు.
హలాలా తంతు పూర్తి చేసి తనను తిరిగి పెళ్లాడాలంటూ రియాజుద్దీన్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆమె అందుకు నిరాకరించడంతో ఈడ్చి పడేశాడు. ఆమె దుస్తులు చింపేశాడు. అంతేకాదు, ఆమెపై అత్యాచారానికీ యత్నించాడు. ఇంట్లో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుండడంతో ఇరుగుపొరుగువారు గమనించి అక్కడికి చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
రియాజుద్దీన్ ఖాన్ ఉత్తరప్రదేశ్ ఎంఐఎం కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు బాధితురాలు తెలిపింది. తనను బెదిరించేందుకు, హతమార్చేందుకు తన రాజకీయ పరపతిని ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించింది. అయితే, ఆమె చెప్పింది పూర్తిగా అవాస్తవమని, వారం రోజుల క్రితమే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చేశానని రియాజుద్దీన్ తెలిపాడు. తనను నుంచి డబ్బులు గుంజేందుకే ఆమె ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.