కరోనాతో మాజీ అథ్లెట్ సూరత్సింగ్ మృతి
ABN , First Publish Date - 2021-06-13T09:28:39+05:30 IST
కరోనా వైరస్ మరో మాజీ అథ్లెట్ను బలితీసుకుంది. 1951 ఆసియా క్రీడల మారథాన్ కాంస్య పతక విజేత, 1952 ఒలింపిక్స్లో పాల్గొన్న సూరత్ సింగ్ మాథుర్ (90) కొవిడ్తో...
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరో మాజీ అథ్లెట్ను బలితీసుకుంది. 1951 ఆసియా క్రీడల మారథాన్ కాంస్య పతక విజేత, 1952 ఒలింపిక్స్లో పాల్గొన్న సూరత్ సింగ్ మాథుర్ (90) కొవిడ్తో శుక్రవారం మరణించాడు. సూరత్ మృతికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య సంతాపం ప్రకటించింది. అతడిని భారత అథ్లెటిక్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’గా అభివర్ణించింది.