గ్యాస్ ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే: అశోక్ గజపతి

ABN , First Publish Date - 2021-10-07T18:36:40+05:30 IST

గ్యాస్ ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.

గ్యాస్ ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే: అశోక్ గజపతి

విజయనగరం: గ్యాస్ ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు అశోక్ గజపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల మంటతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వైషమ్యాలు లేకుండా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో అసలు తెలుగు భాష లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచమంతా తల్లి భాషలోనే విద్య కొనసాగుతోందని...కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు చేయలేదు కాబట్టే అప్పట్లో తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రధాని మోడీ..కొన్ని విషయాల్లో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా సౌకర్యాలను తాకట్టు పెడుతోందని... ఇది ప్రపంచంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. స్కూల్, ఆస్పత్రులాంటి ప్రజా సౌకర్యాలను తాకట్టు పెట్టె ప్రభుత్వం... జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలను తాకట్టు పెట్టగలరా అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-07T18:36:40+05:30 IST