జే ట్యాక్స్‌ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-20T09:10:25+05:30 IST

‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్‌రెడ్డి జే ట్యాక్స్‌ రూపంలో వందలు... వేల కోట్ల రూపాయలు లూఠీ చేస్తున్నారు. అవి విసిరి

జే ట్యాక్స్‌ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు: చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్‌రెడ్డి జే ట్యాక్స్‌ రూపంలో వందలు... వేల కోట్ల రూపాయలు లూఠీ చేస్తున్నారు. అవి విసిరి ప్రలోభాల ఎరలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు’’ అని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. విశాఖ నగర టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ వైసీపీలో చేరిన నేపథ్యంలో శనివారం ఆయన ఆ జిల్లా పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైసీపీ అవినీతి, అరాచకాలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్ళించడానికే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘‘నాయకులు వస్తారు... పోతారు. పార్టీ శాశ్వతం. ప్రజల ఆదరణ, కార్యకర్తల అభిమానం ఉన్నంతకాలం టీడీపీకి ఢోకా లేదు. పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. థనాయకులు, కార్యకర్తలు కలిసికట్టు గా పనిచేసి వైసీపీ ప్రలోభాలను, అరాచకాలను తిప్పి కొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2020-09-20T09:10:25+05:30 IST