లాక్డౌన్ విఫలం: రాహుల్
ABN , First Publish Date - 2020-05-27T07:03:31+05:30 IST
కరోనా కట్టడి కోసం 60 రోజులుగా లాక్ డౌన్ను విధించినప్పటికీ దాన్ని అరికట్టడంలో మోదీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం 60 రోజులుగా లాక్ డౌన్ను విధించినప్పటికీ దాన్ని అరికట్టడంలో మోదీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రధాని తన వైఫల్యాన్ని ఒప్పుకొని భవిష్యత్ కార్యాచరణ, వ్యూహం ప్రకటించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ కార్మికులు ఇత ర రాష్ట్రాల్లో పనిచేయాలంటే తమ ప్రభుత్వ అనుమతి అవసరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి చేసిన వ్యాఖ్యల్ని రాహుల్ ఖండించారు. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా పనిచేయవచ్చునని, అందుకు ఎవరి అనుమతి అక్కర్లేదన్నారు. కాగా రాహు ల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. లాక్డౌన్ వల్లే భారత్ విజయవంతమైందని కేంద్ర మంత్రి జావడేకర్ వ్యాఖ్యానించారు. ఈ సమయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు.