ఐపీఎల్ తరహాలో ఢిల్లీలో టీ20 లీగ్.. గంభీర్ ప్లాన్

ABN , First Publish Date - 2021-08-09T11:00:10+05:30 IST

బీజేపీ నేత, ఎంపీ గౌతం గంభీర్ ఓ టీ20 టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని 10 నియోజకవర్గాల..

ఐపీఎల్ తరహాలో ఢిల్లీలో టీ20 లీగ్.. గంభీర్ ప్లాన్

న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఎంపీ గౌతం గంభీర్ ఓ టీ20 టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని 10 నియోజకవర్గాల మధ్య ఈ క్రికెట్ టోర్నీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభమైపోయాయి. ఇక ఈ టోర్నీ వివరాల్లోకి వెళితే.. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 17 సంవత్సారాలు నిండినవారై ఉండాలి. అలాగే 36 ఏళ్లకు నిండని ఉండకూడదు. అలాగే ప్రతి జట్టు బేస్ ధర నిర్ణయించిన తరువాత ఆటగాళ్ల వేలంపాట జరుగనుంది. అంతేకాకుండా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేయడం, క్రికెట్ కిట్లు అందించడం, ఇతర సౌకర్యాలకు ఏ లోటూ రాకుండా చూడడం జరుగుతుందని గంభీర్ వెల్లడించారు.


Updated Date - 2021-08-09T11:00:10+05:30 IST