మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-18T22:02:13+05:30 IST

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఆయన భార్య ఆశా హుడా కరోనా బారిన..

మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

ఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, ఆయన భార్య ఆశా హుడా కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిది. దీంతో వీరు గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 73 ఏళ్ల కాంగ్రెస్ నేత హుడా, ఆయన భార్య ఢిల్లీలో ఉంటున్నారని, ముందస్తు జాగ్రత్తగా మేదాంత ఆసుపత్రిలో వారు చేరినట్టు పార్టీ ఎమ్మెల్యే బీబీ పాత్ర తెలిపారు. హుడాకు శనివారంనాడు స్వల్యంగా జ్వరం వచ్చిందని, ఆ తర్వాత ఆయనకు, ఆయన భార్యకు కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కాగా, గత ఏడాది హుడా కుమారుడు, రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా సైతం కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. హర్యానా ముఖ్యమంత్రి ఎం.ఎల్.ఖట్టార్, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్, స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా, పలువురు మంత్రులు సైతం గత ఏడాది కరోనా పాజిటి‌వ్‌తో చికిత్స తీసుకున్నారు.

Updated Date - 2021-04-18T22:02:13+05:30 IST