కబడ్డీ మాజీ ప్లేయర్‌ సుదర్శన్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-18T05:43:52+05:30 IST

జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు యు.సుదర్శన్‌ యాదవ్‌ (74) గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన సుదర్శన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తరఫున పలు జాతీయ పోటీల్లో...

కబడ్డీ మాజీ ప్లేయర్‌ సుదర్శన్‌ మృతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)/వైఎంసీఏ: జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు యు.సుదర్శన్‌ యాదవ్‌ (74) గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన సుదర్శన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తరఫున పలు జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు.   సమైక్య ఆంధ్రప్రదేశ్‌ పీఈటీ సంఘం అధ్యక్షుడిగా, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించాడు. 1973-76 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కబడ్డీ జట్టుకు సారథ్యం వహించాడు. ఆయన తెలంగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌కు సోదరుడు. 


Updated Date - 2021-04-18T05:43:52+05:30 IST