బీజేపీలోకి మణిపూర్ కాంగ్రెస్ మాజీ చీఫ్

ABN , First Publish Date - 2021-08-02T00:36:36+05:30 IST

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో జరుగనున్న తరుణంలో నేతల పార్టీ..

బీజేపీలోకి మణిపూర్ కాంగ్రెస్ మాజీ చీఫ్

న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో జరుగనున్న తరుణంలో నేతల పార్టీ ఫిరాయింపులు చోటుచేసుకుంటున్నాయి. మణిపూర్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గోవిందాస్ కొంతౌజమ్ ఆదివారంనాడు బీజేపీ కండువా కప్పుకున్నారు. మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


దీనికి మందు పార్టీ కార్యాలయంలో మీడియాతో బీరెన్ సింగ్ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇటీవలే ఈ ప్రాంతం నుంచి ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేసేందుకు మణిపూర్ కట్టుబడి ఉందని చెప్పారు. కాగా, జూలై 28న గోవిందాస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సమర్పించారు.

Updated Date - 2021-08-02T00:36:36+05:30 IST