భావితరాలకు ఏం మెసేజ్ ఇవ్వనున్నారు: అమర్నాథ్

ABN , First Publish Date - 2021-10-24T17:51:31+05:30 IST

ప్రశ్నించే వారిని లోపల పెట్టడం, భయపెట్టడం ప్రశాంత్ కిషోర్ సలహాతో చేస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.

భావితరాలకు ఏం మెసేజ్ ఇవ్వనున్నారు: అమర్నాథ్

తిరుపతి: ప్రశ్నించే వారిని లోపల పెట్టడం, భయపెట్టడం ప్రశాంత్ కిషోర్ సలహాతో చేస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 2019కి ముందు ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాను వాడుకుని తప్పులు ప్రచారం చేసి వైసీపీని అధికారంలోకి తెచ్చారన్నారు. అప్పుడు సోషల్ మీడియాలలో ఆక్టివ్‌గా ఉన్న వైసీపీ వారు ఇప్పుడు ఏమి చెప్పలేక సైలెంట్ అయ్యారని అన్నారు. వైసీపీని పెంచలేక టీడీపీని తగ్గించే పని చిత్తూర్ జిల్లాలో జరుగుతోందని తెలిపారు.


లేని అబద్దాల అభియోగాలు మోపి అనేక మంది టీడీపీ నేతలను రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావితరాలకు ఏం మెసేజ్ ఇవ్వనున్నారని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల ఇంటికి పోలీసులు వస్తే 41 నోటీసు ఇవ్వమని అడగాలన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ తరపున న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. పార్టీ క్యాడర్‌కు అండగా నిలబడతామని చెప్పారు. పోలీసులు మరో ఏడాది మాత్రం వైసీపీ మాట వింటారు ఆ తర్వాత వారి మాట ఎవ్వరూ వినరన్నారు. డ్రంగ్స్ ఇక్కడ నుంచే విదేశాలకుపోతోందని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-24T17:51:31+05:30 IST