ప్రతిపక్షాన్ని తిడితే కరోనా తగ్గుతుందా?: ఆలపాటి

ABN , First Publish Date - 2021-05-07T09:57:13+05:30 IST

‘‘రాష్ట్రంలో పరిస్థితులపై ప్రతిపక్షం తన సూచనలు ఇస్తుంది. తప్పులు జరిగితే ఎత్తిచూపుతుంది. ప్రతిపక్షాన్ని తిడితే కరోనా పోతుందా? మీ రోషాన్ని ప్రతిపక్ష నేతలపై కాకుండా ప్రజలకు మంచి చికిత్స ఇవ్వడంలో చూపండి’’ అని

ప్రతిపక్షాన్ని తిడితే కరోనా తగ్గుతుందా?: ఆలపాటి

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో పరిస్థితులపై ప్రతిపక్షం తన సూచనలు ఇస్తుంది. తప్పులు జరిగితే ఎత్తిచూపుతుంది. ప్రతిపక్షాన్ని తిడితే కరోనా పోతుందా? మీ రోషాన్ని ప్రతిపక్ష నేతలపై కాకుండా ప్రజలకు మంచి చికిత్స ఇవ్వడంలో చూపండి’’ అని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ సూచించారు. వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబుపై చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వ్యాక్సిన్లు, కరోనా పరీక్షల కోసం గుంపులు గుంపులుగా ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఈ పడిగాపుల్లో అనేక మందికి వైరస్‌ సోకుతోందని చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని, అదే ఉంటే మద్యం షాపులకు అనుమతి ఇచ్చేవారే కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-05-07T09:57:13+05:30 IST