ఈటలతో పాటు కాషాయ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ

ABN , First Publish Date - 2021-06-14T17:44:11+05:30 IST

మాజీ మంత్రి, కీలకనేత ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈటలతో పాటు కాషాయ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ

ఢిల్లీ : మాజీ మంత్రి, కీలకనేత ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు.


గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై రమేష్ రాథోడ్ అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని తన అనుచరులు, అభిమానులతో మాట్లాడిన తర్వాతనే  రమేష్ రాథోడ్ బీజేపీలో చేరినట్లు సమాచారం. రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో కాషాయం బలపడనుంది.  గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరనుండడంతో ఖానాపూర్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

Updated Date - 2021-06-14T17:44:11+05:30 IST