జగన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి: GV
ABN , First Publish Date - 2021-11-20T17:19:05+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దేవతలాంటి భువనేశ్వరిని అవమానించినందుకు జగన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకారంతో సొంత తండ్రి చెంపఛెళ్లుమనిపించిన దుర్మార్గుడు... తల్లిని, చెల్లిని రాజకీయాలకు వాడుకొని వదిలేశాడంటూ విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతమై, తన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని భావించే ముఖ్యమంత్రి అసెంబ్లీలో దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షనేతను దూషిస్తుంటే... విలన్లా జగన్ ఆనందిస్తాడా? అని మండిపడ్డారు. జగన్ వికృత చేష్టలతో ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యలు చేశారు. నేడు మాజీ మంత్రి వివేకా హత్య కేసు వ్యవహారం జగన్ మెడకు చుట్టుకోబోతోందని జీవీ ఆంజనేయులు అన్నారు.