కర్నూలు టీడీపీ నేతలతో...మాజీ ఎమ్మెల్యే సమీక్ష
ABN , First Publish Date - 2021-06-23T06:33:53+05:30 IST
తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సమన్వయ కర్త, అనంత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మంగళవారం కర్నూలుకు వెళ్లారు.
అనంతపురం వైద్యం, జూన22: తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సమన్వయ కర్త, అనంత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మంగళవారం కర్నూలుకు వెళ్లారు. అక్కడ కర్నూలు పార్ల మెంటు అధ్యక్షుడు సోమసెట్టి వెంకటేశ్వరులు, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు తదితర నేతలతో సమావేశమై పార్టీ పటిష్టతపై సమీ క్షించారు. జిల్లా, మండల కమిటీలను త్వరగా నియమించి పార్టీని మరింత పటిష్ట పరుచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చౌదరి తెలిపారు.