సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్

ABN , First Publish Date - 2020-06-07T00:07:40+05:30 IST

సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్

సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. కరోనా వైరస్ ను తొలి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తేలికగా తీసుకున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తేలికగా మాట్లాడటం వల్ల మిగతా మంత్రులు, అధికారుల్లో కరోనాపై నిర్లక్ష్యభావం ఏర్పడిందని విమర్శించారు. ఫలితంగా రాష్ట్రం నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అనపర్తి నియోజకవర్గంలో కరోనా కేసులు పెరగడానికి స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ లో గణేష్ హోటల్ కు పర్మిషన్ ఇచ్చి గొల్లలమామిడాడ గ్రామంలో కరోనా వ్యాప్తికి కారణమైన అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో సంక్షోభ పరిస్థితి నెలకొంటే.. ఎమ్మెల్యే పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడం సిగ్గుచేటని, ఎమ్మెల్యే పెళ్లిరోజు వేడుకలకు హాజరైన వారందరికీ తక్షణమే కరోనా టెస్టులు జరిపించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-07T00:07:40+05:30 IST