టీడీపీ బలోపేతానికి కృషి: మాజీ ఎమ్మెల్యే వర్మ

ABN , First Publish Date - 2020-07-06T11:16:38+05:30 IST

టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరు అంకితభావంతో పనిచేయాలని..

టీడీపీ బలోపేతానికి కృషి: మాజీ ఎమ్మెల్యే వర్మ

మండల, పట్టణ కమిటీల నూతన కమిటీ ఎన్నిక


పిఠాపురం, జూలై 5: టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరు అంకితభావంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు పెచ్చెట్టి చంద్రమౌళి సూచించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. పార్టీ పిఠాపురం పట్టణ కమిటీ అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులుగా రెడ్డెం భాస్కరరావు, కొరుప్రోలు శ్రీనివాసరావు, మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సకుమళ్ల గంగాధర్‌, బర్ల అప్పారావు, గొల్లప్రోలు పట్టణానికి గుండ్ర సుబ్బారావు, కొత్తలంక వీరభద్రాచార్యులు, మండలానికి ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, కొత్తపల్లి మండలాధ్యక్ష, ప్రదాన కార్యదర్శులుగా అనిశెట్టి సత్యానందరెడ్డి, రాయుడు శ్రీరాములు ఎన్నికయ్యారు. 


Updated Date - 2020-07-06T11:16:38+05:30 IST