బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ జేసీ పరామర్శ

ABN , First Publish Date - 2021-07-23T06:48:57+05:30 IST

మండలంలో కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్‌ గురువారం పరామర్శించారు.

బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ జేసీ పరామర్శ
పరామర్శిస్తున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

పామిడి, జూలై 22: మండలంలో కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్‌ గురువారం పరామర్శించారు. పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో మాజీ కౌన్సిలర్‌ బెనకల నాగేశ్వరమ్మ భర్త టీడీపీ నాయకులు రంగారెడ్డి, సొరకాయలపేటకు చెందిన మాజీ సర్పంచు జ యమోహన, మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేష్‌ కరోనాతో మృతి చెందగా, ఆయా కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అధైర్య పడకండి.. నేనున్నా అంటూ మనోధైర్యం నిం పారు. సొరకాయలపేటలో ఆపరేషన చేయించుకున్న టీడీపీ నాయకుడు ఆటో డ్రైవర్‌ ఓ బుళయ్య యాదవ్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మినారాయణరెడ్డి, గుత్తి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన చెన్నకేశవరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, టీడీపీ మండల కన్వీనర్‌ ముసలిరెడ్డి,   నాయకులు రామాంజనేయులు యాదవ్‌, రామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-23T06:48:57+05:30 IST