ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ స్పందించాలి : దేవెగౌడ

ABN , First Publish Date - 2021-08-17T22:02:39+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలపై భారత ప్రభుత్వం మానవత్వంతో

ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ స్పందించాలి : దేవెగౌడ

బెంగళూరు : ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలపై భారత ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ కోరారు. ఆఫ్ఘనిస్థాన్‌ను భయం, అనిశ్చితి చుట్టుముట్టాయన్నారు. భారత దేశంతోపాటు ఈ ప్రాంతానికి ఈ సమయం చాలా సంక్లిష్టమైనదని తెలిపారు. మన పొరుగు దేశాలతో స్నేహం వృద్ధి చెందేవిధంగా స్వతంత్ర విధానాన్ని రూపొందించాలన్నారు. 


దేవె గౌడ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆఫ్ఘనిస్థాన్‌ను భయాందోళనలు, అనిశ్చితి చుట్టుముట్టినట్లు ఆ దేశం నుంచి వస్తున్న సమాచారం వెల్లడిస్తోందన్నారు. భారత దేశానికి, ఈ ప్రాంతానికి ఈ సమయం చాలా ఇబ్బందికరమని పేర్కొన్నారు. మన పొరుగు దేశాలతో స్నేహపూర్వక, శాంతియుత సంబంధాలను వృద్ధి చేసుకునేందుకు స్వతంత్ర విధానాన్ని రూపొందించుకోవడంతోపాటు ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలపై మానవీయ పద్ధతిలో మనం స్పందించాలన్నారు. 


Updated Date - 2021-08-17T22:02:39+05:30 IST