ప్రణబ్ ఆరోగ్యం విషమమే... ఎలాంటి మార్పులూ లేవు : వైద్యులు
ABN , First Publish Date - 2020-08-14T16:47:49+05:30 IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ఎలాంటి మార్పులూ లేవని
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ఎలాంటి మార్పులూ లేవని శుక్రవారం వైద్యులు ప్రకటించారు. ఇంకా వెంటిలేటర్పైనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ‘‘నేటి వరకూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఆయన ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఉన్నారు.’’ అని ఆర్మీ వైద్యులు తెలిపారు.