ఏయూ మాజీ ఉప కులపతి రొక్కం రాధాకృష్ణ కన్నుమూత

ABN , First Publish Date - 2022-01-29T06:25:37+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి, ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ రొక్కం రాధాకృష్ణ (79) శుక్రవారం కన్నుమూశారు.

ఏయూ మాజీ ఉప కులపతి రొక్కం రాధాకృష్ణ కన్నుమూత

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి, ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ రొక్కం రాధాకృష్ణ (79) శుక్రవారం కన్నుమూశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 12వ ఉప కులపతి (1998 నుంచి 2001 వరకు)గా పనిచేసిన రాధాకృష్ణ సమర్థ సేవలు అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు ప్రకటించారు.

Updated Date - 2022-01-29T06:25:37+05:30 IST